మొగలిగిద్ద గ్రామంలో  ప్రజా గోస..బీజేపీ భరోసా.. - బీజేపీ రాష్ట్ర నాయకులు భరత్  గౌడ్ | Mudra News

మొగలిగిద్ద గ్రామంలో  ప్రజా గోస..బీజేపీ భరోసా.. - బీజేపీ రాష్ట్ర నాయకులు భరత్  గౌడ్ | Mudra News

షాద్ నగర్, ముద్ర: ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని మొగలిగిద్ద గ్రామంలో 'ప్రజా గోస.. బీజేపీ భరోసా' కార్యక్రమాన్ని నిర్వహించారు. బూత్ కమిటీ అధ్యక్షులు పిల్లి బాబు, మాధగారి రాఘవేందర్, శక్తి కేంద్ర సహా ఇంఛార్జి పాలమోని యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన కార్నర్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు భరత్ గౌడ్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న  అరాచక పాలనకు చరమగీతం పడాల్సిన అవసరం ఉందన్నారు.  దళితుని ముఖ్యమంత్రి చేస్తాని చెప్పి మోసం చేసిన కెసిఆర్ నేడు సబండవర్గాలను మోసం చేస్తున్నారన్నారు. రైతుకు రుణమాఫీ చేస్తామని చేయలేదని, డబుల్ బెడ్ రూమ్ కడతాం అని చెప్పి కట్టలేదన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుందన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ కరోన సమయంలో ప్రజలకు 3 వాక్సిన్ లు ఉచితంగా ఇచ్చారన్నారు. పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అన్ని వర్గాల సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. షాదనగర్ నియోజకవర్గ నాయకులు మాట్