భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ఇంటిపై అక్రమ ఐటి దాడులను ఖండించాలి .. -బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల పిలుపు

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ఇంటిపై అక్రమ ఐటి దాడులను ఖండించాలి ..  -బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల పిలుపు

ప్రతి మండల కేంద్రంలో నియంతృత్వ మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఎండగట్టాలి....

ముద్ర ప్రతినిది, భువనగిరి: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ఇంటిపై నిన్నటి నుండి నిరంతరాయంగా జరుగుతున్న అక్రమ ఐటి దాడులను నిరసిస్తూ మండల కేంద్రాల్లో,గ్రామాల్లో,మున్సిపల్ వార్డుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అని యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలోని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎంపీల ఇళ్లపై దాడులను చేస్తున్నాయి దీనిని ఖండించాలి.బిఆర్ఎస్ పార్టీ మరియు అనుబంధ సంఘాల బాధ్యులు చొరవ తీసుకొని కార్యకర్తలు,ప్రజలతో కలిసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రకటనలో పేర్కొన్నారు. నిస్వార్థంతో ఎలాంటి మచ్చ లేని నాయకునిగా ప్రజలకు చేస్తున్న సేవను చూసి ఓర్వలేక కొన్ని శక్తులు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయని వాటిని ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలని, అందుకు భువనగిరి నియోజకవర్గం ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు అదనపు చొరవ తీసుకోవాలని కోరారు.