జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

మోత్కూర్(ముద్ర న్యూస్): మండలంలోవి  పనిచేస్తున్న జర్నలిస్టులకు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తు చేయాలని కోరగా, బుధవారం మోత్కూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే  గాదరి కిషోర్ కుమార్ కి జర్నలిస్టులు  తమ జాబితాను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తామని, తాను గతంలోనే హామీ ఇచ్చానని తక్షణమే ప్రభుత్వ స్థలం కేటాయింపు కొరకు పరిశీలన చేయాలని తహసిల్దార్ అహ్మద్ ని ఎమ్మెల్యే ఆదేశించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో స్వరాష్ట్ర సాధన కోసం ,జర్నలిస్టులు తమ వృత్తిపరంగా ఎంతో సహకారం అందించారని అన్నారు.జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు నాయకులు కాగితాల నర్సిరెడ్డి, ఎస్ ఎన్ చారి ,వెలిమినేటి జహంగీర్, గుంటి అయిలయ్య ,దబ్బేటి సోంబాబు ,గుండు ప్రసాద్, ఆకవరం శ్రీనివాస్ చారి, కాపర్తి సైమన్, వారాల రాకేష్ ,బోయిని వెంకట్, ధబ్బేటి రమేష్, నాగరాజు ,ముషం శ్రీనివాస్, బిల్లపాటి మహేందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ,సూరారం నర్సింహా, వారాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.