నేడు కేటీఆర్ పర్యటన

నేడు కేటీఆర్ పర్యటన
  • విపక్ష నేతల ముందస్తు అరెస్ట్

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీలు, వివిధ ప్రజాసంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆయా నేతల నివాస గృహాలకు తెల్లవారుజామునే పోలీసులు వెళ్లి కొందరిని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించగా మరికొందరిని హౌస్ అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మొదలుకొని, గల్లీస్థాయి లీడర్ వరకు ముందస్తు అరెస్టులు చేయడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఉన్నమా? రాచరిక వ్యవస్థలో ఉన్నామా? అంటూ పలువురు విపక్ష పార్టీల నేతలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం తప్పక చెబుతారని పేర్కొన్నారు.