నేడు రాష్ట్రానికి ప్రధాని మోడీ
- జహీరాబాద్, మెదక్ లో ఎన్నికల ప్రచారం
ముద్ర, తెలంగాణ బ్యూరో : లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాష్ట్రానికి రానున్నారు. బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా మోడీ ప్రచారం చేయనున్నారు.
ఈ సందర్భంగా మధ్యాహ్నం 2 గంటలకు అల్లాదుర్గ్ లోని ఐవీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబాద్- మెదక్ జనసభలో మోడీ ప్రసంగించనున్నారు. మూడోసారి అధికారంలోకి వస్తే.. చేపట్టబోయే అభివృద్ధి పనులను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించనున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి సోమవారం వెల్లడించారు. అలాగే మే 1వ తేదీన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మే 5వ తేదీన నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్నియోజకవర్గ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా అమిత్ షా మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.