జాన్‌ పహాడ్‌ ఉర్సు ఉత్సవాల్లో పాల్గోన్న ఎంపి, ఎమ్మెల్యే

జాన్‌ పహాడ్‌ ఉర్సు ఉత్సవాల్లో పాల్గోన్న ఎంపి, ఎమ్మెల్యే

సూర్యాపేట  జాన్‌ పహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవాల్లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తదితరులు పాల్గోన్నారు.  ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ గవర్నర్‌ తమిళసై తనస్థాయిని మరచి బిజెపి కార్యకర్తల వ్యవహరిస్తున్నారు.

తెలంగాణలో అమలవుతున్న పథకాలు అద్భుతంగా ఉంటే, పక్క రాష్ట్రానికి వెళ్లి  తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. తమిళసై ఒక రాజ్యాంగ శక్తిలా తయారై.. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని అపరదిష్టపాలు చేసే కార్యక్రమంలో నిమగ్నమైతున్నారు. నేడు రాజ్‌ భవన్‌ ను భారతీయ జనతా పార్టీ కార్యాలయం గా మార్చేలా తయారయ్యారు. సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ తమిళ సై ని గౌరవిస్తుంటే ఆ గౌరవాన్ని నిలబెట్టుకోట్లేదు.

తెలంగాణపై, సీఎంపై వ్యక్తిగత కక్ష పెంచుకోవడం తగదు. బిజెపి స్క్రిప్ట్‌ ని అవలంబిస్తూ బిజెపి ఏది చెప్తే దాన్నే చేస్తున్నారు. వాటినే తెలంగాణ రాష్ట్రంలో అవలంబిస్తున్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని అభివృద్ది జరిగింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాకి కలెక్టరేట్లు.. ప్రతి మండలానికి వైద్య, విద్య అందిస్తున్నానీ. రైతులకొసం సీఎం కేసీఆర్‌ ఎంతగానో అభివృద్ధి చెస్తున్నారు.యావత్‌ రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తుందని అన్నారు.ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని.. గవర్నర్‌ కి నచ్చడం లేదని అన్నారు