వార్డుల్లో కొనసాగుతున్న  చెత్త సేకరణ

వార్డుల్లో కొనసాగుతున్న  చెత్త సేకరణ

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట:స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా వార్డులో చేపట్టిన చెత్త సేకరణ కొనసాగుతోంది. ప్రతిరోజు ఉదయం వార్డుల్లో మున్సిపల్ పాలకవర్గం సభ్యులు అధికారులు నడుస్తూ చేపట్టిన చెత్త సేకరణ సోమవారం నాడు 13,9 వ వార్డులలో కొనసాగింది.పట్టణం పరిశుభ్రంగా మార్చడం లక్ష్యంగా మంత్రి తన్నీరు హరీష్ రావు ఇచ్చిన పిలుపుమేరకు మేరకు కమిషనర్ సంపత్ కుమార్,మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు,వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు వార్డుల కౌన్సిలర్లు రాపల్లివిఠోబా,పసకుల సతీష్,మున్సిపల్ కౌన్సిలర్లు సాయన్న గారి సుందర్, సాయిశ్వర్గౌడ్, నాయకం లక్ష్మణ్, ఆర్ఎంపి వైద్యుడు డాక్టర్ దుందిరాపు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు సభ్యులు,మున్సిపల్ సిబ్బంది ఉదయాన్నే వార్డులలో వాకింగ్ చేస్తూ అక్కడక్కడ గల పేపర్,కవర్ లను,చెత్తను ఏర్వేశారు.స్వచ్ఛ సిద్దిపేటకు ఆరోగ్య సిద్దిపేటకు సహకరించాలని ప్రజలను వారు కోరారు.