లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే 

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే 

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని నార్సింగి మండల కేంద్రంలో మంగళవారం రోజున లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీముల ద్వారా 8 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే ఈ సందర్భంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మండల అధికారులు , ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.