అన్నారం తాండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అన్నారం తాండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • బైక్ ను డీ కొట్టిన డీసీఎం 
  • ఇద్దరు మృతి - మరొకరి పరిస్థితి విషమం
  • పరామర్శించిన మంత్రి జూపల్లి

 

ముద్ర,పానుగల్:-పానుగల్ మండలం అన్నారం తాండ వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా,మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. మరొకరికి తీవ్ర రక్త గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా వుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దావాజీ పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బైక్ పై పానుగల్ కు వెళ్తుండగా అన్నారం తాండ వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం బైక్ ను  డీ కొట్టడంతో  బైక్ పై వున్న శివ,రాంబాబు మృతి చెందారు. మరొకరు శ్రీకాంత్ కు తీవ్ర రక్తగాయలు కాగా హైద్రాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇట్టి సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని తెలుసుకున్న రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతదేహాలపై పుష్ప గుచ్చాని ఉంచి నివాళులు అర్పించారు.మృతుల కుటుంబాలను పరామర్శించారు.