వేసవిలో మొక్కలను కాపాడుకోవాలి

వేసవిలో మొక్కలను కాపాడుకోవాలి

 జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్
 ముద్ర ప్రతినిధి, వనపర్తి : వేసవిలో మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజు మున్సిపాలిటీ ట్యాంకర్ తో నీరు పట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రోడ్ల వెంట రహదారి మొక్కలకు వాటర్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ మున్సిపల్ ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీరు పట్టించారు. పట్టణంలో పచ్చదనం వెల్లి విరిసేలా ప్రతి మొక్కను కుటుంబ సభ్యులుగా పోషించుకోవాలని కలెక్టర్ సూచించారు. అధికారులు మున్సిపాలిటీ సిబ్బంది మొక్కల పెరుగుదలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.