BIG BREAKING - చంద్రబాబుతో వైఎస్ షర్మిల భేటీ
ముద్ర,తెలంగాణ:- టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఎం జగన్ సోదరి, కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడారు.
తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని చంద్రబాబు కుటుంబానికి ఆహ్వాన పత్రికను అందజేశానని తెలిపారు. వివాహానికి వస్తానని చంద్రబాబు చెప్పారన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ప్రస్తావన వచ్చిందన్నారు. వైఎస్సార్ తో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారని తెలిపారు.