క్రీడలతో  స్నేహం మరింత పెరుగుతుంది

క్రీడలతో  స్నేహం మరింత పెరుగుతుంది

ముద్ర.వీపనగండ్ల:- క్రీడా పోటీల వల్ల స్నేహభావం పెరగడంతో పాటు మానసిక ఉల్లాసం పెంపొందుతుందని వీపనగండ్ల ఎస్సై రవి ప్రకాష్ ,వనపర్తి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఇంద్రకంటి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఇంద్రకంటి వెంకటేష్  అన్నారు. మండల పరిధిలోని సంగినేనిపల్లిలో ఇంద్రకంటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్సై రవి ప్రకాష్, ఇంద్రకంటి వెంకటేష్ లు మాట్లాడుతూ క్రీడలు దేహదారుడ్యానికి దోహదం చేస్తాయని అంతేకాకుండా ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఓటమి గెలుపుకు నాంది పలుకుతుందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మౌలాలి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోదల బీరయ్య, రైతుబంధు సమితి మండలం మాజీ అధ్యక్షులు ఎత్తం కృష్ణయ్య, నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ విజయభాస్కర్ రెడ్డి, నాయకులు సుదర్శన్ రెడ్డి, రామిరెడ్డి, చక్ర వెంకటేష్, కృష్ణ,మీసాల మోహన్, ధనుంజయ తదితరులు ఉన్నారు.