ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసి చూపిస్తాం
- ప్రతిపక్షాల మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు...
- మంథని లో సినిమా ధియేటర్, కల్వచర్ల గ్రామపంచాయతీ నూతన భవనం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
ముద్ర ప్రతినిధి పెద్దపల్లి :తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసి చూపిస్తామని, ప్రతిపక్షాల మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని, మంథని లో సినిమా ధియేటర్ కల్వచర్ల లో గ్రామపంచాయతీ నూతన భవనం ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, కలవరిచర్ల సర్పంచ్ గంట పద్మా వెంకట రమణారెడ్డి ఉప సర్పంచ్ కనకయ్య యాదవ్, వార్డు సభ్యులు.
- మంంథని లో సినిమా థియేటర్ ఏర్పాటు అభినందనీయం - మంత్రి శ్రీధర్ బాబు
మంథని లో సినిమా ధియేటర్ ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు కృషిచేసిన ప్రముఖ న్యాయవాది ముస్కుల సయేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, తో పాటు పలువురిని మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎంపీపీ కొండా శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, ముత్తారం మాజీ జడ్పిటిసి లు నాగినేని జగన్మోహన్ రావు, మైదం భారతి వరప్రసాద్, అజీమ్ ఖాన్, వనం రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.