బిజెపి లో పలువురి చేరికలు

బిజెపి లో పలువురి చేరికలు
Many people joined in BJP

ముద్ర ప్రతినిధి కరీంనగర్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో చామన పల్లి గ్రామానికి చెందిన పలువురు  బిజెపి పార్టీలో చేరారు. దూడం రమేష్, వేల్పుల గంగాధర్ రావు, గుజ్జరి కుమార్, కచ్చు వేణులు కాషాయతీర్థం పుచ్చుకున్నారు. చమన్ పల్లి గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ సందర్భంగా వారికి సూచించారు. కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ ధూబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు దాసరి రమణారెడ్డి , జిల్లా అధికార ప్రతినిధి ఊగిలే సుధాకర్ పటేల్, దూడం శ్రీనివాస్ కరీంనగర్ రూరల్ మండలం అధికార ప్రతినిధి, బూర్ల రాజు, దాసరిమహేష్, దూడం గణేష్, దూడం అరవింద్, దూడం వెంకటేశం, మిట్టపల్లి బాలరాజు, దీకొండ మహేష్, దూడం అఖిల్, తదితరుల పాల్గొన్నారు.