నట రత్నాలు ఆడియో ఫంక్షన్లో సుమన్పై శివనాగు ఫైర్
సుదర్శన్, రంగస్థలం మహేశ్, అర్జున్ తేజ్ కీలక పాత్రధారులుగా నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నట రత్నాలు’. ఇనయా సుల్తాన కథానాయిక. మర్డర్ మిస్టరీ క్రైం థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డా.దివ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేదిక హైదరాబాద్లో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ మాజీ ఎంఎల్ఎ ఎరపతినేని శ్రీనివాసరావు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. దివ్యవాణి, డా. పద్మ, చికోటి ప్రవీణ్ తదితరలులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘గతంలో నేను కొన్ని ఆడియో ఫంక్షన్లకు వచ్చా. కర్నూల్లో జరిగిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రం వేడుక కర్నూల్లో జరిగినప్పుడు లక్షమందికి పైగా హాజరయ్యారు. కానీ ఆ సినిమా నాకు నచ్చలేదు. సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, మిర్చి తరహా చిత్రాలంటే నాకు ఇష్టం. ఈ చిత్రం బాగా నడుస్తుందని భావిస్తున్నా. చిత్ర బృందాన్ని నా శుభాకాంక్షలు. నా బయోపిక్ ఎలక్షన్ల ముందుకు కాదు తర్వాత రావాలని చెప్పా. ‘బాహుబలి’ రేంజ్ బడ్జెట్తో ఆ సినిమా ఉంటుంది’’ అని అన్నారు.చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ ‘‘చిన్న సినిమాతోనే పరిశ్రమ మనుగడ ఉంది. ప్రస్తుతం మినిమమ్ బడ్జెట్ చిత్రాలు ఇండస్ట్రీకి నాలుగో స్తంభంగా నిలుస్తున్నాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.