శృతి మించితే బాడీగార్డులు తప్పదు
సెలబ్రెటీలు ఎప్పుడూ చాలా సెక్యూర్గా సెక్యూరిటీతో వస్తుంటారు. అందులోనూ సినిమా హీరోయిన్ల విషయానికి వస్తే ఇది ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అభిమానులైతే సెల్పీలంటూ మీద పడతారు. పబ్లిక్ లోకి వస్తే ఆకతాయిల ఇబ్బందులు తప్పవు. ఇటీవల శృతిహాసన్ ముంబై ఎయిర్ పోర్టులో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంది. ఓ దుండగుడు అమ్మడిని కార్ పార్కింగ్ వరకూ వెంబడించాడు. అతను పెద్దగా ఇబ్బంది పెట్టనప్పటికీ ఒంటరిగా ఉండడంతో భయపడింది. దీంతో శృతిహాసన్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇకపై ఇలాంటి భయాలకు గురికాకుండా వ్యక్తిగత బాడీ గార్డులను నియమించుకుందిట. ఇప్పటికే ఈ అమ్మడు బాడీ గార్డులను నియమించుకోవాల్సి ఉందని.. కానీ వ్యక్తగత స్వేచ్ఛకు ఇబ్బంది కలుగుతుందనే ఇంతకాలం నియమించలేదని అంటోంది.