విషాదం.. ఆస్థికలు కలిపేందుకు వచ్చి.. ప్రాజెక్టులో మునిగి ఇద్దరు మృతి

విషాదం.. ఆస్థికలు కలిపేందుకు వచ్చి.. ప్రాజెక్టులో మునిగి ఇద్దరు మృతి

ముద్ర ప్రతినిధి, మెదక్: ఆస్థికలు కలిపేందుకు వచ్చి... ప్రాజెక్టులో మునిగి ఇద్దరు మృతి చెందిన సంఘటన మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దులోగల పోచారం ప్రాజెక్టులో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...కామారెడ్డి జిల్లా  రాజంపేట మండలం కొండాపూర్ గ్రామం పంచాయతీ పరిధి ఇనాం తండాకు చెందిన చౌహన్ హరిసింగ్(45), బాల్ సింగ్(41) అన్నదమ్ములు. పెద్ద నాన్న లచ్య మరణించగా అస్థికలను శనివారం ఉదయం ప్రాజెక్టులో కలిపేందుకు వచ్చారు. ఈ క్రమంలో హరియా ప్రాజెక్టులో దిగే క్రమంలో నీట మునిగాడు. గమనించిన బాల్ సింగ్ అన్నను కాపాడే క్రమంలో ఇద్దరు నీట మునిగారు.  విషయం తెలుసుకున్న హవెలి ఘనపూర్ పోలీసులు ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీసి పంచనామ అనంతరం శవ పరీక్ష నిమిత్తం మెదక్  ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆనంద్ గౌడ్ తెలిపారు.