కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా

కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా
  • ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో అధిష్టానం నిర్ణయం మేరకు పని చేస్తానని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా నియోజక వర్గకేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టికెట్ల విషయంలో చేర్పులు, మార్పులు ఉంటాయని సీఎం చెప్పినట్లు తెలిపారు. ఏది ఏమైనా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. రాజయ్య సహకారంతో పని చేస్తానని కడియం శ్రీహరి మాట్లాడడం సంతోషకరమని కమిటీలను సంప్రదించకపోవడం బాధాకరం అన్నారు. తనకు ఎమ్మెల్సీ గాని, ఎంపీ గాని, రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడిగా గాని అవకాశం కల్పిస్తామని కేటీఆర్ చెప్పాడు అన్నారు. కార్యకర్తలలో గందరగోళం సృష్టించకుండా అందర్నీ కలుపుకుపోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తాటికొండ సురేష్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్, ఎంపీటీసీలు గన్ను నరసింహులు, సింగపురం దయాకర్, నాయకులు మహేందర్ రెడ్డి, తోట సత్యం, కనకం గణేష్, రంగు హరీష్, అశోక్, చిరంజీవి, మారేపల్లి ప్రసాద్, గుండె మల్లేష్, నరసింహ, దేవయ్య, శ్రీనివాస్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.