ఎమ్మెల్యే రాజయ్య క్షమాపణ చెప్పాలి

ఎమ్మెల్యే రాజయ్య క్షమాపణ చెప్పాలి

టిఆర్ఎస్, బిజెపిలను ఓడిస్తాం
రాష్ట్ర నాయకులు డాక్టర్ కృష్ణ

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే టి.రాజయ్య భేశరత్తుగా  క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ డిమాండ్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే పదవిని తన వ్యక్తిగత లబ్ధి కోసం కోసం వదులుకున్నాడు తప్ప తెలంగాణ కోసం కాదన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు చేస్తున్న జోడో యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అధికారం కోసం టిఆర్ఎస్ లో చేరితే ఉప ముఖ్యమంత్రిగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడనికి మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసిన రాజయ్యకు సోయి రాలేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని మతతత్వ బిజెపి పార్టీని, కుటుంబ పాలన కొనసాగిస్తున్న టిఆర్ఎస్ పార్టీలను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో మరో రాష్ట్ర నాయకుడు చేపూరి వినోద్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బేతి జయపాల్ రెడ్డి,  భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ సారయ్య, చల్ల తిరుపతి, రవి,  సంపత్, మల్లయ్య, సంతోష్, రాజు, గట్టు వెంకటస్వామి, రత్నాకర్ రెడ్డి, సుమన్ నాయక్, చంద్రు, ఎల్లయ్య  వివిధ గ్రామాల చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.