5000 దివ్యాంగుల యోగా

5000 దివ్యాంగుల యోగా
  • ఆసియా బుక్ రికార్డ్, వండర్ బుక్స్ ఆఫ్ వరల్డ్, ఇండియా 3 రికార్డ్ లలో  రికార్డ్ నమోదు
  • ముఖ్య అతిధిలుగా కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్, కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి హాజరయ్యారు

ముద్ర, షాద్‌నగర్ : బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని నందిగామ మండలం కన్హా శాంతి వనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 5 వేల మంది  దివ్యాంగులు పాల్గొన్నారు. ఆసియా బుక్ రికార్డ్ , వండర్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో అత్యంత ఎక్కువ మంది దివ్యాంగులు ఒకే దగ్గర యోగా చేసినట్లు రికార్డ్ గా నమోదు అయ్యిందని నిర్వాహకులు పేర్కొన్నారు. రికార్డ్ సర్టిఫికెట్లు అందచేశారు. యోగా లో పాల్గొన్న దివ్యాంగులకు సర్టిఫికెట్లు అందజేశారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్, కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి హాజరయ్యారు.