సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

షాద్ నగర్, ముద్ర: అనారోగ్యంతో బాధపడుతున్న వారు సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన గడ్డం నర్సమ్మ ₹60,000, తట్టేపల్లి ఈశ్వర్ ₹24,000, సయ్యద్ పాషా ₹16,000 మంజూరయ్యాయన్నారు. మెరుగైన చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాల్సిందిగా సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా స్పందించిన సీఎం నిధులు మంజూరు చేశారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, కొత్తపేట సర్పంచ్ కామ్లేకార్ నవీన్ కుమార్, కోఆప్షన్ సభ్యులు జమాల్ ఖాన్, ఉపసర్పంచ్ నరేష్ యాదవ్, వార్డు సభ్యులు జగన్ రెడ్డి, గ్రామ కమిటి అధ్యక్షులు గణేష్ గౌడ్, నాయకులు మామిడి యాదయ్య గౌడ్, బాలయ్య గౌడ్, గడ్డం నరేష్,  పండరి గౌడ్, తదితరులు పాల్గొన్నారు