ఆన్లైన్ బెట్టింగులకు యువకుడు బలి

ఆన్లైన్ బెట్టింగులకు యువకుడు బలి

ముద్ర ప్రతినిధి, మెదక్:ఆన్లైన్ బెట్టింగ్ ఓ యువకుడిని బలిగొంది. సుమారు 15 లక్షలు పోగొట్టుకొని యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాపన్నపేట మండలం పోడ్చన్ పల్లి తండాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం పొడ్చన్ పల్లి తండాకు చెందిన మోహన్, బుజ్జిలకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు మురళి (20) ఢిల్లీలో అగ్రికల్చర్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల సొంత గ్రామమైన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్ పల్లి తండాకు వచ్చాడు. ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి సుమారు 15 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. బుధవారం రాత్రి గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.