మోత్కూర్ లో పదవ తరగతి విద్యార్థుల అత్యంత ప్రతిభ.

మోత్కూర్ లో పదవ తరగతి విద్యార్థుల అత్యంత ప్రతిభ.

మోత్కూర్, ముద్ర: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2023-24 , 10వ తరగతి ఫలితాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోత్కూర్ నుండి 128 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 118 మంది ఉత్తీర్ణులయ్యారు.  92 శాతం ఉత్తీర్ణ సాధించారు.ఇందులో 9.8 జిపిఎ  ఇద్దరు విద్యార్థినిలు  సాధించారు.9.8 సాధించిన విద్యార్థినిలు చామకూర తేజ శ్రీ,,పయ్యావుల సరయు శ్రీ లను పాఠశాలప్రధానోపాధ్యాయులు తీపిరెడ్డి గోపాల్ రెడ్డి, ఉపాధ్యాయినీ  ఉపాధ్యాయులు అభినందించారు.మోత్కుర్ లోని ఐదు ప్రైవేట్ పాఠశాలలో వందకు వందశాతం ఉత్తీర్ణత  సాధించారు.

అక్షర కాన్సెప్ట్ పాఠశాల లో ముగ్గురు విద్యార్ధులు పదికి పది శాతం ఉత్తీర్ణ సాధించారు. మోత్కూర్ మండలంలో మొత్తం 56 మంది విద్యార్థులకు గాను 54 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 475 మంది పాసయ్యారు.29  మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. మొత్తం 94.25% ఉత్తీర్ణత సాధించారు. వివిధ పాఠశాలలో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందించారు.