బస్సు అదుపుతప్పి లోయలో పడి 15 మంది మృతి
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఖర్గోన్ దగ్గర బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ సర్కారు ఎక్స్గేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున ప్రకటించింది.