20 లక్షల ఎస్బిఐ ప్రమాద బీమా చెక్కు అందజేత

20 లక్షల ఎస్బిఐ ప్రమాద బీమా చెక్కు అందజేత

శాయంపేట, ముద్ర:  మండలానికి  చెందిన ఆర్.ఎం.పి డాక్టర్ రాచర్ల ప్రభాకర్ భార్య సంధ్య రైలు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాయంపేట శాఖలో పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద ఆమెకు 20 లక్షలు మంజూరు కాగా, అట్టి క్లైమ్ చెక్కును శనివారం ఆమె కూతురుకు బ్రాంచ్ మేనేజర్ సిహెచ్. చక్రధర్, ఫీల్డ్ ఆఫీసర్ శ్యామ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్బిఐ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరు పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మినిమం 100 రూపాయలు, మాక్సిమం 1000 రూపాయలు భీమా ప్రీమియం చెల్లిస్తే, ప్రమాదవశాత్తు ఖాతాదారుడు మరణం సంభవించితే 100కు రెండు లక్షలు, 1000 కి 20 లక్షలు క్లెయిమ్ అందజేయబడి కుటుంబానికి కొండంత భరోసా ఇస్తుందన్నారు. బ్యాంకు ఖాతాదారులు ఇన్సూరెన్స్ చేసుకొని కుటుంబానికి భరోసా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్యాష్ ఆఫీసర్ కిషోర్, క్యాషియర్ లు ప్రణయ్, మనోజ్ కుమార్, ఎఫ్ ఓ ఎస్ ఎండి అక్బర్ పాషా, సిబ్బంది పాల్గొన్నారు.