బండసోమరం గ్రామ సాయి బాబా దేవాలయంలో 22వ వార్షికోత్సవం
ముద్ర ప్రతినిధి భువనగిరి :యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బండసోమరం గ్రామంలోని శిరిడి సాయి బాబా దేవాలయంలో 22వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల 30 లకు పతావిష్కరణ , 7 గంటలకు గణపతి హోమం , 8 గంటలకు ధుని పూజా , 8 గంటల 30 నిమిషాలకు బాబా కి ప్రత్యేక అభిషేకాలు , మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్నం హారతి 12 గంటల 30 నిమిషాలకు సాయి తీర్థప్రసాద వితరణ మరియు మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో రావి సుమతి నరసింహారెడ్డి , రావి వెంకటరెడ్డి సుమలత , దేవాలయం అధ్యక్షులు రావి శ్రీహిత రాజేందర్ రెడ్డి , ఉపాధ్యక్షులు కాటిక అనుజరాని జంగయ్య , సబితా సత్యనారాయణ రెడ్డి , జూబితా శ్రీనివాసరెడ్డి , సబిత సత్యనారాయణ రెడ్డి, పెద్దలు , గ్రామస్తులు , సాయి భక్తులు పాల్గొన్నారు .