బండసోమరం గ్రామ సాయి బాబా దేవాలయంలో 22వ వార్షికోత్సవం

బండసోమరం గ్రామ సాయి బాబా దేవాలయంలో  22వ వార్షికోత్సవం

ముద్ర ప్రతినిధి భువనగిరి :యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బండసోమరం గ్రామంలోని  శిరిడి సాయి బాబా దేవాలయంలో 22వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.   ఉదయం 6 గంటల 30 లకు పతావిష్కరణ , 7 గంటలకు గణపతి హోమం , 8 గంటలకు ధుని పూజా , 8 గంటల 30 నిమిషాలకు బాబా కి ప్రత్యేక అభిషేకాలు , మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్నం హారతి  12 గంటల 30 నిమిషాలకు సాయి తీర్థప్రసాద వితరణ మరియు మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో రావి సుమతి నరసింహారెడ్డి  , రావి  వెంకటరెడ్డి సుమలత , దేవాలయం అధ్యక్షులు రావి శ్రీహిత రాజేందర్ రెడ్డి , ఉపాధ్యక్షులు కాటిక అనుజరాని జంగయ్య  ,  సబితా సత్యనారాయణ రెడ్డి  , జూబితా శ్రీనివాసరెడ్డి , సబిత సత్యనారాయణ రెడ్డి, పెద్దలు , గ్రామస్తులు , సాయి భక్తులు  పాల్గొన్నారు .