కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా చెక్కు అందజేత
![కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా చెక్కు అందజేత](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_6512d1c81ba07.jpg)
ముద్ర ప్రతినిధి భువనగిరి :మండలంలోని హనుమాపురం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్త జడల సత్యనారాయణ గత కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన ప్రమాద బీమా పథకం కింద రెండు లక్షల రూపాయల చెక్కును అతని భార్య జడల లతకి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు జనగాం పాండు, జెడ్పిటిసి బీరు మల్లయ్య, వైస్ ఎంపీపీ సంజీవరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు రాగాల శ్రీనివాస్ చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్మరియు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు సింగరేణి నర్సిరెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేశం, సాదినేని ఉపేందర్, పండుగ సురేష్, ఏ.సత్యనారాయణ పాల్గొన్నారు.