లాస్య నందితను వెంటాడిన మృత్యువు ... మృతికి కారణాలివే
ముద్ర,హైదరాబాద్:- బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ నుంచి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య నందిత శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన ఆమె.. స్పాట్లోనే చనిపోయారు. ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి.. డివైడర్ను ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఇక ఈ దుర్ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత.. స్పాట్లోనే మృతి చెందగా.. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.
లాస్య నందిత మృతికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయంటున్నారు పోలీసులు....వాటి వివరాలు ఇలా...
మొదటి కారణం:- లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు.. శుక్రవారం ఉదయం మేడ్చల్ నుంచి పటాన్చెరువు వస్తుండగా ప్రమాదానికి గురైంది. ఆమె మృతికి ప్రధాన కారణం అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు అని పోలీసులు అనుమానిస్తున్నారు. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్.. తమ కారు ముందు వెళ్తోన్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో సడన్ బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు.. అదుపు తప్పి ఔటర్ రింగ్ రోడ్డు రెయిలింగ్ను ఢీకొట్టడంతో.. యాక్సిడెంట్ జరిగింది.
రెండో కారణం:- యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఎమ్మెల్యే లాస్య నందిత సీటు బెల్టు పెట్టుకోలేదని తెలిసింది. దాని వల్ల ఆమె ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యి.. ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అంటున్నారు పోలీసులు. సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే.. గాయాలతో బయటపడేవారని.. ఇత దారుణం జరిగేది కాదని వారు చెబుతున్నారు.
మూడో కారణం:-లాస్య నందిత ప్రయాణిస్తున్న మారుతీ సుజుకీ ఎక్స్ఎల్6 కారుకి సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉంది. అది తెలిసి కూడా వారు అతివేగంతో ప్రయాణించడం ప్రమాదానికి మరో కారణం అంటున్నారు పోలీసులు. ఇక యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ను మదీనాగూడ శ్రీకర హాస్పిటల్కు తరలించారు.