మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు…

మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు…

ముద్ర,తెలంగాణ:- తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో భూకబ్జా కేసు నమోదైంది. పేట్‌ బహీరాబాద్ లోని 32 గుంటల భూమిని మల్లారెడ్డి కుటుంబీకులు కబ్జా చేసినట్లు రెవెన్యూ శాఖ అధికారుల సర్వేలో తేలింది. దీంతో ఆయనతో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పేట్‌బషీరాబాద్ లో అసైన్‌మెంట్ స్థలాన్ని ఆక్రమించుకున్నారని శ్రీనివాసరెడ్డి చేసిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదయింది. ఇటీవలే అక్కడ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను తొలగించడంతో రెవెన్యూ శాఖ అధికారులు ఈ ల్యాండ్ పై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇందులో కబ్జాకు గురైనట్లు తేలడంతో పాటు ఫిర్యాదు అందడంతో మల్లారెడ్డి పై కేసు నమోదైంది.