ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు బెయిల్
![ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు బెయిల్](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6405cdb694e99.jpg)
దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పాస్పోర్టు అప్పజెప్పాలని, రూ.2లక్షల పూచీకత్తు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఫిబ్రవరి 8న బుచ్చిబాబును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే.