ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు రావాలి
![ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు రావాలి](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63ee484c7fcfd.jpg)
షాబాద్, ముద్ర: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతల సహకారం అవసరమని ఎంపీపీ కోట్ల ప్రశాంతి మహేందర్ రెడ్డి అన్నారు, గురువారం మండల పరిధిలోని పోతుగల్ ఉన్నత పాఠశాలలో కా ల్కమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల లో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, ఎంఈఓ శంకర్ రాథోడ్, సర్పంచ్ ఇస్మాత్ బేగం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఎన్జీవో ప్రాజెక్టు మేనేజర్ ముంతాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.