తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్ భార్య, కుమార్తె, నటి నయనతారతో కలిసి దర్శనం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్ భార్య, కుమార్తె, నటి నయనతారతో కలిసి దర్శనం

ముద్ర, తెలంగాణ బ్యూరో : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన కుటుంబంతో కలిసి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య గౌరీఖాన్‌, కుమార్తె సుహానాఖాన్, నటి నయనతారతో కలిసి ఆయన సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తొలుత దేవస్థానం అధికారులు షారుఖ్‌కు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత షారుఖ్ గర్భాలయంలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ తరువాత పండితులు షారుఖ్‌కు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. షారుఖ్ నటించిన ‘జవాన్’ చిత్రం ఈ నెల 7న విడుదల కానుండడంతో ఆయన తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.