What's Your Reaction?
Join our subscribers list to get the latest news, updates and special offers directly in your inbox
ముద్ర ప్రతినిధి కరీంనగర్:- కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే సుమారు 10 ఇళ్ల వరకు దగ్ధమయ్యాయి సిలిండర్లు పేలిపోతున్నాయి పరిసర ప్రాంత ప్రజలు ఏమి చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకొని మండల ప్రయత్నం చేస్తున్నారు. తీవ్ర ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
స్థానికులు కొందరు కొందరు జిలేటన్ స్టిక్స్ పేలుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు యంత్రాంగం సంఘటన స్థలంలోనే మకాం వేశారు. మంగళవారం ఉదయం సుభాష్ నగర్లోని పూరి ఇళ్లలో భారీగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి దాదాపు ఐదు ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ పేలుడు కారణంగా చుట్టు పక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రానట్లు తెలుస్తోంది. కాగా, ఆ గుడిసెల్లో నివసించే కార్మికులంతా మేడారం జాతరకు కుటుంబసమేతంగా తరలి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి గత 20 ఏళ్లుగా కార్మికులు ఆ పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ముద్ర వార్తలు May 15, 2024
ముద్ర వార్తలు May 14, 2024
ముద్ర వార్తలు May 19, 2024
ముద్ర వార్తలు May 14, 2024
ముద్ర వార్తలు May 18, 2024
ముద్ర వార్తలు May 18, 2024
ముద్ర వార్తలు May 18, 2024
Total Vote: 513
KCR