ఓఆర్‌ఆర్‌పై నుంచి కిందపడిన కారు... ఇద్దరు మృతి

ఓఆర్‌ఆర్‌పై నుంచి కిందపడిన కారు... ఇద్దరు మృతి

ముద్ర,హైదరాబాద్‌:- ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు రంగారెడ్డి జిల్లా నార్సింగి వద్ద అదుపుతప్పి ఓఆర్‌ఆర్‌పై నుంచి కింద పడింది. దీంతో ఇద్దరు యువకులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్కు  తరలించారు.ఘటనా స్థలంలో ఒకరు మరణించగా, హాస్పిటల్కు తరలిస్తుండగా మరొకరు చనిపోయారని పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.