ఉత్సాహభరితంగా  హెరిటేజ్ రన్

ఉత్సాహభరితంగా  హెరిటేజ్ రన్

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: మన  పరిసరాల్లో ఉన్న హెరిటేజ్ సంపదను పరిరక్షించుకోవటంతో పాటు వాటిని మన భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ ఆదివారం నాడు మణికొండలోని లాంకో హిల్స్ లో  హెరిటేజ్ రన్‌‌-3 కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు జి. రంజిత్ రెడ్డి, ఎల్​ఐసీ ఇండియా జోనల్​ మేనేజర్​ ఎల్​కే శ్యాంసుందర్​, ల్యాంకో హిల్స్ టెక్ పార్క్, ఆర్గనైజర్స్ సీఈఓ ఎస్. వెంకట రాంరెడ్డి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం. రమేష్ రెడ్డితో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఐదు కిలోమీటర్ల పాఠశాల రెండో లాంకో హిల్స్, దాని పరిసరాల్లో గల కాలనీలకు చెందిన సుమారు 800 మంది పాల్గొన్నారు.