ఘనంగా తెలుగు సంగమం -సంక్రాంతి సమ్మేళనం
ముద్ర, హైదరాబాద్ : హైదరాబాద్లోని నార్సింగిలో గల ఓం కన్వెన్షన్ లో తెలుగు సంగమం -సంక్రాంతి సమ్మేళనం –24 వేడుక ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మిజోరం గౌవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. నటుడు బ్రహ్మనందం గౌరవ అతిథిగా విచ్చేశారు. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు, పలువురు సీనియర్ ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన గంగిరెద్దుల ఆటపాటలు, హరిదాసుల కోలాటం, జానపద, శాస్త్రీయ నృత్యాలు, జానపద కళారూపాలు ఎంతగానో అలరించాయి.