ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు  బీజేపీ యాలాల మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బీఅర్ఎస్ లో చేరిక

ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు  బీజేపీ యాలాల మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బీఅర్ఎస్ లో చేరిక
  • కండువా కప్పి ఆహ్వానించచిన సీనియర్ నాయకులు పంజుగుల విఠల్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల్ మండలానికి చెందిన ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్ గౌడ్ , బాజపా యాలాల మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నర్సింలు మంగళ వారం బీఅర్ఎస్ పార్టీలో లో చేరారు. వారికి సీనియర్ నాయకులు పంజుగుల విఠల్ రెడ్డి  కండువా కప్పి ఆహ్వానించారు. అదేవిధంగా యాలాల మండలం ముద్దాయిపేట్ గ్రామం కాంగ్రెస్ నాయకులు గొల్ల లక్ష్మయ్య, మహేష్ బీఅర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షణీయులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తం రావు, మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు అక్బర్ బాబా తదితులున్నారు.