ఐఆర్‌ఆర్‌ కేసులో చంద్రబాబుపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు

ఐఆర్‌ఆర్‌ కేసులో చంద్రబాబుపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు

వెలగపూడి  : ఐఆర్‌ఆర్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈనెల 29కి విచారణను కోర్టు వాయిదా వేసింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో సైతం హైకోర్టులో విచారణ ఈనెల 30కి వాయిదా పడింది.