ప్రజలందరు బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు - మాజీ ఎంపి రమేష్ రాథోడ్

ప్రజలందరు బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు -  మాజీ ఎంపి రమేష్ రాథోడ్

ఖానాపూర్, ముద్ర : తెలంగాణ ప్రజలందరు బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని మాజీ ఎంపీ, బీజేపీ నాయకులు రాథోడ్ రమేష్ అన్నారు. ఖానాపూర్ మండలంలోని బీర్నంది, రంగపేట్, సోమర్పేట్ గ్రామాల్లో ఆదివారం ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ మాయ మాటలు నమ్మే పరిస్థితి లేదని, కల్లి బొల్లి మాటలతో కాలం గడిపారని మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధి బిజెపి తోని సాధ్యం అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఆశిర్వధించాలని ప్రజలకు కోరారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను పేరు మార్చి రాష్టం చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవటం సిగ్గు చేటని ఆగ్రహం చెందారు. సోమరిపేట్ మాజీ ఎంపీటీసీ బండారి రవి తో పాటు వంద మంది వివిధ పార్టీల వారు బీజేపీ లో చేరటంతో కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు టేకు ప్రకాష్,నాయిని సంతోష్, లాoడేరి కిషన్, ఆకుల శ్రీనివాస్, రమేష్, రవి, తోకల బుచ్చన్న, దాదే మల్లయ్య, మహేందర్, రవీందర్ రెడ్డి, రాజేశ్వర్,  అనిల్  రావు, శేఖర్, రుస్తుం తదితరులు పాల్గొన్నారు.