లోక్సభ ఎన్నికల నేపధ్యంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్ లపై అవగాహన
న్యూఢిల్లీ :త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల నేపధ్యంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్త అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం దేవవ్యాప్తంగా 3500 కంటే ఎక్కువ ప్రదర్శన కేంద్రాలు , 4250 మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేసారు. పౌరులకు ఓటింగ్ ప్రక్రియ మరియు యంత్రాలతో పరిచయం. అవగాహన కార్యక్రమంగా దీనిని ఉద్దేశించారు. ప్రతి లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభకు జరిగే ప్రతి సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వీవీ ప్యాట్ స్లిప్ ద్వారా వారి ఎంపికలను ఎలా ధృవీకరించాలో ఓటర్లకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో 3, 464 అసెంబ్లీ కేంద్రాలు, 31 రాష్ట్రాలు/యూటీలలో (5 రాష్ట్రాలు కాకుండా ఇతర ప్రాంతాలలో) 613 జిల్లాల్లో విస్తరించిన నియోజకవర్గాలలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఈ కార్యక్రమం గురించి తెలియజేసామని ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ అనూజ్ చందక్ ఒక ప్రకటనలో తెలిపారు.