బీఆర్ఎస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి..

బీఆర్ఎస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి..

గౌడ సంఘాల జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ చిర్ర రాజు గౌడ్..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గౌడ సంఘాల జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ చిర్ర రాజు గౌడ్ పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గీత కార్మికులకు చెట్ల పన్ను రద్దు చేయడం, ప్రమాదాల బారిన పడిన గీతా కార్మీకులకు ఎక్స్ గ్రేషియా పెంచడం, బీమా సౌకర్యం కల్పించడం లాంటి కార్యక్రమాలు తెలంగాణలో చేపట్టి గౌడుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేసిందన్నారు.

భూపాలపల్లి నియోజకవర్గంలో గౌడులకు ప్రత్యేక భవన నిర్మాణం ఏర్పాటు చేయడం, జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సహకారం అందించడం గౌడ కులస్తులు మర్చిపోవద్దన్నారు. ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో గౌడ సంఘాల జేఏసీ భూపాలపల్లి జిల్లా కన్వీనర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్ గౌడ్ తో పాటు వివిధ మండలాల గౌడ సంఘం నాయకులు. గీత కార్మికులు పాల్గొన్నారు.