స్వర్ణాభరణాలతో దర్శనమిచ్చిన బాలరాముడు
ముద్ర,సెంట్రల్ డెస్క్:- స్వర్ణాభరణాలతో బాలరాముడు భక్తులకు దర్శనమిచ్చాడు.ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో బాలరాముడి దర్శనం భక్త కోటిని పులకరింప చేసింది.అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్ల మంది హిందువల ఐదు శతాబ్దాల స్వప్నం సాకారమైంది. రామమందిరంలో రంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది.
ఈ చారిత్రక ప్రాణప్రతిష్ఠ క్రతువులో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఇవాళ మధ్యాహ్నం 12.289 గంటలకు అభిజిత్ లఘ్నంలో 84 సెకన్ల పాటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సాగింది. ఈ ఘట్టాన్ని అయోధ్యలో ఉన్న వేల మంది, టీవీల్లో కోట్ల మంది శ్రీరామభక్తులు కనులారా వీక్షించారు. మనసారా ఆ బాలరాముడిని స్మరించుకున్నారు.