సర్వారంలో కలకలం రేపుతున్న కారు దగ్ధం  

సర్వారంలో కలకలం రేపుతున్న కారు దగ్ధం  

ముద్ర,ముత్తారం:- ముత్తారం మండలంలోని మైదంబండ గ్రామ పంచాయతీలోని సర్వారంలో కారు దగ్ధం కలకాలం రేపు తుంది. గ్రామస్తులు కథనం ప్రకారం ఆదివారం సాయంత్రం మైదంబండ గ్రామానికి ఒక కారు వచ్చిందని, ఆ కారు తిరుగు ప్రయాణంలో రాత్రి 7:30 గంటల సమయంలో సర్వారంలో గ్రామంలో అదుపుతప్పి డ్రైనేజీలో పడిందని.

కారు అదుపుతప్పి పడటంతో కారు అక్కడే వదిలేసి కారు లో ఉన్నవారు వెళ్లి పోయారని,  సోమవారం తెల్లవారుజామున కారు దగ్ధమై ఉందని గ్రామస్తులు తెలిపారు. దగ్ధం చేసిన వారు ఎవరై ఉంటారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారును పరిశీలించారు. ఇప్పటివరకు కారుకు సంబంధించిన వ్యక్తులు ఫిర్యాదు చేయలేదని ఎస్ఐ మధుసూదన్ రావు తెలిపారు. కారు దిగ్గం కావడంతో గ్రామంలో చర్చ చర్చనియాంశంగా  మారింది. ఈ కారును దగ్ధం చేసింది ఎవరని పోలీసులు విచారణ చేపట్టారు. పోలీస్ విచారణలో నిజ నిజాలు తెలనున్నాయి.