మెడికల్ స్టూడెంట్స్ కు మెరుగైన భోజనం అందించాలి..

మెడికల్ స్టూడెంట్స్ కు మెరుగైన భోజనం అందించాలి..
  • జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించే స్టూడెంట్స్ కు మెరుగైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని రామప్ప కాలనీలో మెడికల్ స్టూడెంట్స్ కు ఏర్పాటు చేసిన హాస్టల్, కిచెన్ హాల్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా  ఎంబిబిఎస్ మొదటి సంవత్సరంలో జాయిన్ కావడానికి వచ్చిన రాజస్థాన్ మెడికల్ విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి పరిస్థితులను వివరించారు. హాస్టల్ లో స్టూడెంట్స్ కు అనువైన మౌళిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా నిర్వాహకులను కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాజు దేవుడే, డిస్ట్రిక్ హాస్పిటల్ డిసిహెచ్ డా. నవీన్ తదితరులు పాల్గొన్నారు.