వినూత్న రీతిలో జీపీ కార్మికుల సమ్మె - దున్నపోతుకు వినతి పత్రం సమర్పణ

వినూత్న రీతిలో జీపీ కార్మికుల సమ్మె  - దున్నపోతుకు వినతి పత్రం సమర్పణ

ముద్ర, మొగుళ్లపల్లి : జీపీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 28 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో జిపి కార్మికులు వినూత్న రీతిలో  దున్నపోతుకు వినతిపత్రం సమర్పించి తమ నిరసనను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 25 గ్రామాల నుంచి వచ్చిన జీపీ కార్మికులు పాల్గొన్నారు.