పుట్ట మధు గెలుపు కోసం బీఆర్ఎస్ లో చేరికలు

పుట్ట మధు గెలుపు కోసం బీఆర్ఎస్ లో చేరికలు

మహాదేవపూర్, ముద్ర: మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు సర్పంచ్ శ్రీపతిబాపు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పోతరవేని విక్రమ్, బిజేపి పార్టీకి చెందిన అట్టెం రాకేష్, లక్ష్మి ప్రసాద్, దబ్బెట మహేష్, తోట జయ చందర్ లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంథనిలో భారాస పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పుట్ట మధు గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు. పుట్ట మధన్నతోనే మంథని నియోజకవర్గ అభివృధి, ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందనే నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు పోతరవేని విక్రమ్, బిజేపి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు పెండ్యాల మనోహర్, ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్ తో పాటు నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.