శ్రీ లక్ష్మి మోటర్స్ అద్వర్యం లో రక్తదాన శిబిరం

శ్రీ లక్ష్మి మోటర్స్ అద్వర్యం లో రక్తదాన శిబిరం


మోత్కూర్,ముద్ర: మోత్కూర్ మునిసిపల్ కేంద్రంలోని శ్రీ లక్ష్మి మోటర్స్ 15వ వార్షికోత్సవాన్ని పురాష్కరించుకొని నిర్వహిస్తున్న మెగా  సర్విస్ , ఎక్సెంజి కార్నివాల్ కార్యక్రమం లో భాగంగా శుక్రవారం స్థానిక ఎస్ఎం ఫంక్షన్ హాల్ లో ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ హీరో మోటర్స్ అధినేత మెట్టు మంగేష్,గణేష్ లు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతో మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతుండడంతో ఎన్నో కుటుంబాలు వీదిన పడుతున్నాయని అందుకే అత్యవసర సమయాల్లో రక్తం అందించి వారి ప్రాణాలు కాపాడడం కోసమే మా వంతు బాధ్యతగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి లక్ష్మి నర్సింహా రెడ్డి, మండల అధ్యక్షులు ఓ సత్యనారాయణ ,డైరెక్టర్ లు పన్నాల సత్తిరెడ్డి,చేవూరి అనిల్  జి ప్రసాద్,మచ్చేందర్,చంద్రా రెడ్డి,సుబ్రమణ్యా శర్మ, తదితరులు పాల్గొన్నారు