శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కరపత్రం ఆవిష్కరణ

శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కరపత్రం ఆవిష్కరణ


మోత్కూర్,ముద్ర:ఈనెల 24 నుండి ప్రారంభం కానున్న శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమాల కరపత్రాలను శుక్రవారం  మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గుఱ్ఱం కవితా లక్ష్మీ నర్సింహ్మా రెడ్డి ఆవిష్కరించారు.ఈ నెల 24 ఆదివారం రాత్రి తెల్లవారు జామున తెల్లారితే (సోమవారం) స్వామి వారి కళ్యాణం తో మొదలై ఏప్రిల్ 1 తేదీన  దోపోత్సవం తో ముగిసే బ్రహ్మోత్సవ కార్యక్రమాలల్లో శ్రీ రామలంగేశ్వర స్వామి భక్తులు,మోత్కూరు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ కోరారు.ఆలయ అభివృద్ధికి అన్ని రకాలగా సహకరిస్తానని చైర్మన్  గుఱ్ఱం కవితా లక్ష్మీ నర్సింహ్మా రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, ఆలయ కమిటీ చైర్మన్ గుండగోని రామ చంద్రు గౌడ్, సభ్యులు బుర్ర యాదయ్య,ఉయ్యాల అంజయ్య, బొల్లేపల్లి సీతయ్య, బీసు యాదగిరి, మొరిగాల రాజయ్య, పన్నాల శ్రీనివాస్ రెడ్డి,రంగయ్య, పాల్గొన్నారు