రాయిగిరిలో చైన్ స్నాచింగ్
ముద్ర ప్రతినిధి భువనగిరి: భువనగిరి మండలంలోని రాయిగిరి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి రెండు చైన్ స్నాచింగ్ సంఘటనలు జరిగాయి. సంఘటనలకు సంబంధించి పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రాయిగిరి గ్రామానికి చెందిన మాధవి, మద్దూరి శిరీషల తమ తమ ఇళ్ల డాబాలపై నిద్రిస్తుండగా ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మెడలో వున్న పుస్తెల తాడు దొంగలించి పారిపోతుండగా వచ్చిన అలకిడితో బాధితులు నిద్ర నుండి మేల్కొని భయంతో కేకలు వేయగా దొంగ పారిపోయాడని చెప్పారు. బాధితులు మాధవి, మద్దూరి శిరీషల ఫిర్యాదులు మేరకు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.