చైర్ పర్సన్ భర్త పై సి బి సి ఐ డి తో విచారణ జరపాలి: పన్నాల మాధవ రెడ్డి

చైర్ పర్సన్ భర్త పై సి బి సి ఐ డి తో విచారణ జరపాలి: పన్నాల మాధవ రెడ్డి

సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్

మెట్‌పల్లి ముద్ర: మున్సిపల్ చైర్ పర్సన్ భర్త పట్టణాన్ని పందికొక్కుల దొచుకుతింటున్నడని అతనిపై సి బి సి ఐ డి తో విచారణ చేపట్టాలని మున్సిపల్ కో అప్సన్ సభ్యుడు పన్నాల మాధవ రెడ్డి పేర్కొన్నారు. ఈ  మెరకు ఆయన విలేకరులకు ఒక ప్రకటన విడుదల చేశారు. చైర్ పర్సన్ భర్త వైఖరి వలన బీ ఆర్ ఎస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.మున్సిపల్ చైర్ పర్సన్ భర్త సత్యనారయణ భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇన్నాళ్లు బీ ఆర్ ఎస్ పార్టీలో కొనసాగిన మాధవ రెడ్డి ఒక్కసారిగా చైర్ పర్సన్ భర్త కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది.